గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులకు రోడ్డు భద్రతపై ఆర్టీసీ సోమవారం అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత గురించి వివరిస్తూ, వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమస్త ద్వారా కల్పిస్తున్న సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడిసి ప్రేమ్ సింగ్, బస్టాండ్ కంట్రోలర్, సేఫ్టీ వార్డెన్ ఉన్నారు.