బైక్‌ పై లిఫ్ట్‌ ఇచ్చి మహిళపై ఇద్దరు యువకుల అత్యాచారం

51பார்த்தது
బైక్‌ పై లిఫ్ట్‌ ఇచ్చి మహిళపై ఇద్దరు యువకుల అత్యాచారం
బస్సు కోసం వేచి ఉన్న మహిళకు బైక్‌పై లిఫ్ట్‌ ఇచ్చి తీసుకెళ్లి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని తంజావూర్‌ జిల్లాలో జరిగింది. ఓ మహిళ(42) ఈ నెల 3వ తేదీన పనికెళ్లి రాత్రి ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూసింది. ఆ సమయంలో బైక్‌ పై వచ్చిన ప్రవీణ్‌ (32), రాజ్‌(26) అనే యువకులు లిఫ్ట్‌ ఇస్తామని చెప్పి బైక్‌పై తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను గురువారం అరెస్ట్‌ చేశారు.

தொடர்புடைய செய்தி