కృష్ణా జిల్లాలో చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు

51பார்த்தது
కృష్ణా జిల్లాలో చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు
ఏపీలోని కృష్ణా జిల్లాలో అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. గుడివాడ మండలం చౌటపల్లి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎం.చంద్రశేఖర్‌ (42) అనే పీఈటీ ఉపాధ్యాయుడు కొంతకాలంగా నాలుగో తరగతి విద్యార్థినిని అసభ్యంగా తాకుతున్నాడని గుడివాడ రూరల్​ పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. అయితే చిన్నారి స్కూల్‌కు వెళ్లేందుకు నిరాకరించడంతో.. కారణమేమిటని చిన్నారిని తల్లి ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி