తమిళనాడులోని ఉమెన్స్‌ హాస్టల్‌లో పేలిన ఫ్రిడ్జ్‌, ఇద్దరు యువతులు మృతి

66பார்த்தது
తమిళనాడులోని ఉమెన్స్‌ హాస్టల్‌లో పేలిన ఫ్రిడ్జ్‌, ఇద్దరు యువతులు మృతి
తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మదురై జిల్లా కాట్రంపళయం ప్రాంతంలోని విసాక ప్రైవేట్‌ ఉమెన్స్‌ హాస్టల్‌లో గురువారం తెల్లవారుజామున ఫ్రిడ్జ్‌ పేలింది. దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువతులు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

தொடர்புடைய செய்தி