కదిలే బస్సులో మహిళపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడిన క్లీనర్ అరెస్ట్

568பார்த்தது
కదిలే బస్సులో మహిళపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడిన క్లీనర్ అరెస్ట్
ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు క్లీనర్ దారుణానికి ఒడిగట్టాడు. కదులుతున్న బస్సులో ఓ ప్రయాణికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నిందితుడు 27 ఏళ్ల సాయికుమార్ ను కూకట్ పల్లి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. బస్సులో వెనుక లోయర్ బెర్త్ లో తాను ఉండగా నోరు నొక్కి, కర్టన్లు మూసి హెల్పర్ అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. భయంతో తాను మౌనంగా ఉండిపోగా, మరోసారి లైంగిక దాడి చేశాడని చెప్పింది.

தொடர்புடைய செய்தி