జమ్మూకశ్మీర్ రెండో విడత ఎన్నికల్లో 54% పోలింగ్ నమోదు

72பார்த்தது
జమ్మూకశ్మీర్ రెండో విడత ఎన్నికల్లో 54% పోలింగ్ నమోదు
జమ్మూకశ్మీర్‌లో జరిగిన రెండో విడత అసెంబ్లీ ఎన్నికల్లో 7 గంటల వరకు 54.11% పోలింగ్ జరిగింది. ఆరు జిల్లాల్లో 26 స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వహించారు. వ్యాలీలోని 15, జ‌మ్మూలోని 11 స్థానాల్లో పోలింగ్ జ‌రిగింది. శ్రీనగర్‌లో అత్య‌ల్పంగా 27.37% ఓటింగ్ న‌మోదైంది. మాజీ సీఎం ఓమర్ అబ్దుల్లా పోటీ చేసిన బుద్గాం, గందెర్బాల్‌లో 58% పోలింగ్ జరిగింది. ఫస్ట్ ఫేజ్‌లో 61% ఓటింగ్ జ‌రిగిన విషయం తెలిసిందే. చివ‌రి విడ‌త ఎన్నిక‌లు అక్టోబ‌ర్ 1న జ‌ర‌గ‌నున్నాయి.

தொடர்புடைய செய்தி