ఇండోనేషియాలో షాకింగ్ ఘటన జరిగింది. మూడవ అంతస్తులో ఉన్న జిమ్ లో ట్రెడ్మిల్పై పరిగెడుతోన్న 22 ఏళ్ల మహిళ బ్యాలెన్స్ తప్పి అక్కడి నుండి పడి చనిపోయింది. పోంటియానాక్లో ఈ ఘటన జూన్ 18న జరిగింది. ఈ మేరకు ట్రెడ్మిల్పై పరిగెడుతున్న ఆ యువతి టవల్తో తన ముఖాన్ని తుడుచుకోవడానికి ఆగిపోతున్న క్రమంలో బ్యాలెన్స్ తప్పింది. ఆమె వెనకాలే కిటికీ తెరచి ఉండటంతో.. అందులోంచి జారీ కిందపడింది. అక్కడి సీసీటీవీలో రికార్డైన ప్రమాద దృశ్యాలు వైరలవుతున్నాయి.