AP: ముస్లిం రిజర్వేషన్లపై టీడీపీ నేత నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. "తలసరి ఆదాయం తక్కువగా ఉన్న ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం బుజ్జగింపు కాదు.. సామాజిక న్యాయం. వారిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత. 20 ఏళ్లుగా కొనసాగుతున్న రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నాం." అని లోకేశ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.