షర్మిల రాజకీయంగా ఒంటరయ్యారు: భూమన

81பார்த்தது
షర్మిల రాజకీయంగా ఒంటరయ్యారు: భూమన
వైఎస్ షర్మిల రాజకీయంగా ఒంటరయ్యారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఇప్పటివరకు ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. జగన్ లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారని, ఇచ్చిన మాట కోసం సర్వం వదులుకుంటారని పేర్కొన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టినా వీరుడిలా పోరాడుతున్నారన్నారు. జగన్‌ను నిర్వీర్యం చేసేందుకు షర్మిల ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

தொடர்புடைய செய்தி