2, 88, 144 మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు

82பார்த்தது
2, 88, 144 మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు
2, 88, 144 మంది ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు రూ. 122. 64 కోట్లు అక్టోబర్ నెలకు మంజూరైనట్లుగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం తెలిపారు. 2వ తేదీన గాంధీ జయంతి కావటంతో 1వ తేదీన పింఛన్లను పంపిణీ చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పూర్తిచేసే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. అధికారులు బ్యాంకుల నుండి నగదు ఇప్పటికే విత్ డ్రా చేసుకున్నారని తెలిపారు.

தொடர்புடைய செய்தி