వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ఉగ్ర

62பார்த்தது
విజయవాడలోని 41వ డివిజన్ లో వరద ముంపు ప్రాంతాలకు ఇన్చార్జ్ గా ఉన్న కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, కార్పొరేషన్ సిబ్బందితో బుధవారం శానిటేషన్ చర్యలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద ఉధృతి తగ్గిన ప్రతి వీధిలో పారిశుద్ధ్య పనులు చేపట్టి శానిటేషన్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న దుృష్ట్యా పారిశుద్ధ్య పనుల్లో అలసత్వం వద్దని తెలిపారు.

தொடர்புடைய செய்தி