గిద్దలూరు పట్టణంలోని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో రాచర్ల, కొమరోలు, గిద్దలూరు మండలాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆదివారం నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోన్నారు. అశోక్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులను నట్టేట ముంచారని,హామీలను నెరవేర్చగా పోగా ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే అన్నారు.