పెద్దారవీడులో ఇసుక మాయం

85பார்த்தது
పెద్దారవీడులో ఇసుక మాయం
మండల కేంద్రమైన పెద్దారవీడు ఎంపీడీవో కార్యాలయం సమీపంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు డంప్ చేసిన ఇసుక మాయం కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
జగనన్న కాలనీల్లోని ఇళ్ల నిర్మాణాల కోసం కొద్దిరోజుల క్రితం సుమారు 10 ట్రాక్టర్ల ఇసుకను ఎంపీడీవో కార్యాలయం వద్ద నిల్వ ఉంచారు. అయితే అక్కడ డంప్ చేసిన ఇసుక లేనట్లు గుర్తించి సంబంధిత శాఖ అధికారులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.

தொடர்புடைய செய்தி