సిఐటియు ఆధ్వర్యంలో నిరసన

58பார்த்தது
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇసుక కొరత తీర్చడంతో పాటు భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు కార్మికుల కొరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తర్వాత గిద్దలూరు ఎమ్మార్వోకు వినతి పత్రానికి సమర్పించారు.

தொடர்புடைய செய்தி