సమాజ సేవలో కశ్శెట్టి జగన్

79பார்த்தது
తర్లుపాడు మండలంలోని లక్ష్మక్కపల్లె గ్రామానికి వెళ్లే దారికి ఇరువైపులా చిల్లకంప అల్లుకొని ఉండగా, రహదారి వెంట ప్రయాణించే వాహనదారులకు ప్రమాదాలు జరుగుతున్నాయి. అది గమనించిన లక్ష్మక్కపల్లె ఎంపీపీ ఎస్ స్కూల్ లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు కశ్శెట్టి జగన్, తన సొంత నిధులతో జెసిబి సహాయంతో చిల్లకంపను తొలగించడం జరిగింది. తానే కొంతసేపు జెసిబి డ్రైవర్ గా అవతారమెత్తి కంపని తొలగించాడు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని, సమాజ సేవకు కొంత సమయము , డబ్బు కేటాయించాలని తెలియజేశారు.

தொடர்புடைய செய்தி