కొంగలవీడులో ఉచిత వైద్య శిబిరం

61பார்த்தது
కొంగలవీడులో  ఉచిత వైద్య శిబిరం
గిద్దలూరు పట్టణంలోని కొంగలవీడు రోడ్డులో ఆదివారం డాక్టర్ బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో.. కిమ్స్ హాస్పిటల్ వైద్య నిపుణుల సహాయంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేసినట్లుగా డాక్టర్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. 632 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని, ఇందులో కంటి ఆపరేషన్లు అవసరమైన వారు 58 మంది ఉన్నట్లుగా గుర్తించినట్లు చెప్పారు. వీరందరికీ ఉచితంగానే వైద్య సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி