గిద్దలూరు నియోజకవర్గ ప్రజానీకానికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు..నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి కుందూరు నాగార్జున రెడ్డి. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో జీవించాలని, పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మట్టి గణపతి విగ్రహాలనే వినియోగించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.