పేకాట శిబిరంపై దాడి

78பார்த்தது
పేకాట శిబిరంపై దాడి
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని స్థానిక పంట పొలాల్లో పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఐదు మందిని అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి రూ.14,130 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி