గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ని రాచర్ల మండలం గంగంపల్లె గ్రామానికి చెందిన మీనిగే రామచంద్రారెడ్డి ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసి గిద్దలూరు పట్టణంలో ప్రారంభించనున్న అన్న క్యాంటీన్ నిర్వహణకు తన వంతు సహకారంగా 10 వేల రూపాయలు నగదును విరాళంగా అందచేశారు. ఈ కార్యక్రమంలో బిజ్జం వెంకటరామిరెడ్డి, రవీంద్రా రెడ్డి, అనప వీరశేఖర్ తదితరులు పాల్గోన్నారు.