గుంటూరులో రోడ్డు పక్కన మహిళ మృతదేహం

73பார்த்தது
గుంటూరులో రోడ్డు పక్కన మహిళ మృతదేహం
గుంటూరులో రోడ్డు పక్కన ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాల మేరకు రైలుపేటకు చెందిన మారెళ్ల రేవతి (52) అనారోగ్యంతో రోడ్డున మృతి చెంది పడి ఉంది. స్థానికులు గమనించి కొత్తపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సదరు మహిళ మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఆమె వివరాలు తెలిసినవారు పోలీస్ స్టేషన్ లో సంప్రదించాల్సిందిగా పోలీసులు కోరారు.

தொடர்புடைய செய்தி