పాత బిల్లులే కొనసాగించండి: ఆవాజ్ నేతలు

72பார்த்தது
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డ్ చట్ట సవరణ బిల్లును నిలిపివేసి పాత బిల్లులనే కొనసాగించాలని ఆవాజ్ కమిటీ నాయకులు రషీద్ కోరారు. ఈ మేరకు సోమవారం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. పాత బిల్లులే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ కమిటీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி