ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు క్యాంప్ కార్యాలయంగా విజయవాడలోని సూర్యారావుపేటలో ఉన్న ఇరిగేషన్ గెస్ట్హౌస్ ను ప్రభుత్వం కేటాయించింది. పవన్తో పాటు జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లకు కూడా రెండో బ్లాక్లో మొదటి అంతస్తులో పేషీని కేటాయించారు. నేడు అతిథిగృహం వద్దకు వెళ్ళిన పవన్ కళ్యాణ్కు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.. పోలీసు సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.