చేతుల పరిశుభ్రతతోనే ఆరోగ్యం

52பார்த்தது
చేతుల పరిశుభ్రతతోనే ఆరోగ్యం
వినుకొండ మండల పరిధిలోని చీకటీగలపాలెంలోని ఏపీమోడల్ స్కూల్ నందు ఐటీసి ఆధ్వర్యంలో.. విద్యార్థులకు చేతుల పరిశుభ్రత గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఓ మాడెబోయిన గురు ప్రసాద్ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉండాలన్నారు. మల విసర్జన తరువాత, భోజనానికి ముందు తప్పనిసరిగా చేతులను ఆరు స్టెప్పులు ద్వారా శుభ్రపరుచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సతీష్ ఏసోబు,పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, పాఠశాల సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி