తుళ్లూరు: అత్త చెవి కొరికిన కోడలిపై కేసు నమోదు

60பார்த்தது
తుళ్లూరు: అత్త చెవి కొరికిన కోడలిపై కేసు నమోదు
కుటుంబ కలహాల నేపథ్యంలో అత్త చెవిని కొరికెసిన ఘటనపై బుధవారం కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు ఈ నెల 6న తుళ్లూరు మండలం బాలయేసు కాలనీలో అత్తకోడళ్లు గొడవ పడ్డారు. ఈ క్రమంలో అత్త నాగమణి చెవిని కోడలు పావని బలంగా కొరకడంతో కొంతభాగం తెగి పడింది. కాగా చెవి భాగం అతికించి శస్త్రచికిత్స చేయడం వీలు పడదని వైద్యులు చెప్పారు. ఈ విషయమై బుధవారం బాధితుల ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி