నకరికల్లులో దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు

58பார்த்தது
నకరికల్లులో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 8వ రోజు గురువారం అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

தொடர்புடைய செய்தி