గోదాం హమాలీలకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని నిరసన

82பார்த்தது
గోదాం హమాలీలకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని నిరసన
పొన్నూరు పట్టణంలో మండల స్థాయి గోదాముల వద్ద గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు ఆరేటి రామారావు పాల్గొని మాట్లాడుతూ గోదాముల్లో పనిచేసే హమాలి లకు పిఎఫ్ , ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 2 సం. ఒకసారి కూలి రేట్లు పెంచాలని పేర్కొన్నారు. పౌరసరఫరా శాఖ అధికారులు హమాలీల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி