పల్నాడు జిల్లా డిఆర్డిఏ పీడీ పై ఫిర్యాదు

72பார்த்தது
పల్నాడు జిల్లా డిఆర్డిఏ పీడీ బాలు నాయక్ రూ. 5 కోట్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశాడని ముప్పాళ్ల మండల డిఆర్డిఏ సీసీ నాగమల్లేశ్వరావు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. గతంలో తనపై కలెక్టర్కి పెట్టిన ఫిర్యాదుని వెనక్కి తీసుకోకపోతే ఎస్సీ, ఎస్టీ కేసు పెడతానని బాలునాయక్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. బాలు నాయక్ వలన తనకి, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, చర్యలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி