షేక్ అర్షద్ ను అభినందించిన మంత్రి లోకేశ్

71பார்த்தது
షేక్ అర్షద్ ను అభినందించిన మంత్రి లోకేశ్
రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. బుధవారం ఉండవల్లిలోని నివాసంలో ఏఎమ్ఎఫ్ ఫౌండర్ ఆదిత్య మెహతా నేతృత్వంలో పారా క్రీడాకారులు మంత్రి లోకేశ్ ను కలిశారు. ఇటీవల పారిస్ లో నిర్వహించిన పారాలింపిక్స్ లో పాల్గొని అద్భుత ప్రతిభ కనబరచిన షేక్ అర్షద్ ను మంత్రి అభినందించారు. రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి మద్దతుగా నిలుస్తామన్నారు.

தொடர்புடைய செய்தி