ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 15వేల చోరీ

65பார்த்தது
ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 15వేల చోరీ
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 15వేలు చోరీ చేసిన ఘటన పై బుధవారం కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లాలాపేటకు చెందిన గోపాల్ తన అన్న తిరుపతిరావుకి ఆరోగ్యం బాగోక గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆ సమయంలో ఆస్పత్రి ఆవరణలో ఉన్న తన జేబులోని రూ. 15వేల నగదును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி