AP: అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు రాజంపేట వైసీపీ మాజీ MLA మేడా మల్లికార్జునరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అభినందనలు తెలుపుతూ బాబు, పవన్ ఫొటోలతో రెండు భారీ ఫ్లెక్సీలను కూడలిలో ఏర్పాటు చేశారు. కాగా, తాజా ఎన్నికల్లో మేడాకు వైసీపీ టికెట్ ఇవ్వని విషయం విదితమే.