ఆలయాల్లో పూజలు నిర్వహించిన మంత్రి నాదెండ్ల

62பார்த்தது
ఆలయాల్లో పూజలు నిర్వహించిన మంత్రి నాదెండ్ల
మంత్రి నాదెండ్ల మనోహర్ దేవి శరన్నవరాత్రులలో భాగంగా ఆదివారం తెనాలిలోని పలు దేవాలయాల్లో సతీ సమేతంగా పూజలు నిర్వహించారు. తెనాలి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, శివాజీ చౌక్ లోని కాళీమాత గుడి, నందుల పేటలోని సాయిబాబా మందిరం, డాంగే వారి వీధిలో, మారిస్ పేటలోని శివాలయంలో జరిగిన పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆయన వెంట కూటమి నాయకులు, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி