సిరిపూడి పోస్ట్ ఆఫీస్ లో 60 లక్షలు గోల్ మాల్

85பார்த்தது
నగరం మండలం సిరిపూడి గ్రామంలోని పోస్ట్ ఆఫీస్ నందు భారీ మోసం జరిగింది. పోస్ట్ మ్యాన్ బడుగు గోపి మనోజ్ వర్మ అనే వ్యక్తి దాదాపు 300 ఖాతా నుండి 60 లక్షల రూపాయలు వసూలు చేసి పోస్ట్ ఆఫీస్ లో కట్టకుండా పరారయ్యాడని సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రజాసంఘాల నాయకులు గ్రామంలో ఆందోళన చేపట్టారు. పోస్టల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி