మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే

57பார்த்தது
ప్రజల ఆరోగ్య భద్రత ప్రభుత్వం బాధ్యత అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. ఆనందపేట 3వ లైన్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం మెగా మెడికల్ క్యాంప్ జరిగింది. ఈ క్యాంప్ ను ఎమ్మెల్యే నసీర్ ప్రారంభించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేంద్ర, డీఎంహెచ్ఓ విజయలక్ష్మీ, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி