దోష నివారణకు నేడు తిరుమలలో శాంతి హోమం

తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్దనున్న యాగశాలలో సోమవారం ఉదయం శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. హోమం అనంతరం ఆలయంలోని అన్ని ప్రాంతాల్లో పంచగవ్వ ప్రోక్షణ చేస్తామని, దీని వల్ల భక్తుల్లో అపోహల తొలగిపోతాయని పేర్కొన్నారు. దోషాల పరిహారార్థం ప్రతి ఏడాది పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు.

தொடர்புடைய செய்தி