ఎమ్మెల్యే నానాజీని సస్పెండ్ చేయాలి: వైద్యుల సంఘం

57பார்த்தது
ఎమ్మెల్యే నానాజీని సస్పెండ్ చేయాలి: వైద్యుల సంఘం
కాకినాడ ఆర్ఎంసీ వైద్యుడిపై దాడి చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీపై వైద్యులు ఇంకా కోపంగా ఉన్నారు. అతడ్ని జనసేన పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరింది. ఇవాళ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపనుండగా.. మంగళవారం ఇతర సంఘాల మద్దతుతో కాకినాడ ఎస్పీకి ఫిర్యాదు చేయనుంది. కాగా, ఈ ఘటనపై ఎమ్మెల్యే నానాజీ ఇప్పటికే క్షమాపణలు చెప్పారు.

தொடர்புடைய செய்தி