రాష్ట్ర అధికార ప్రతినిధిగా జూపూడి నియామకం

వైయస్సార్సీపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్సీ, ఒంగోలుకు చెందిన జూపూడి ప్రభాకర్ రావును నియమించారు. వైసిపి కేంద్ర కార్యాలయంలో వైయస్సార్ సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం అధికార ప్రతినిధుల పేర్లను ప్రకటించారు. ప్రకాశం జిల్లా నుండి రాష్ట్ర అధికార ప్రతినిధిగా జూపూడి ప్రభాకర్ రావు నియమితులు కావడంతో జిల్లాలోని పలువురు వైసీపీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி