ఢిల్లీ-చెన్నై విమానంలో మహిళకు వేధింపులు.. వ్యక్తి అరెస్ట్‌

63பார்த்தது
ఢిల్లీ-చెన్నై విమానంలో మహిళకు వేధింపులు.. వ్యక్తి అరెస్ట్‌
ఢిల్లీ-చెన్నై ఇండిగో విమానంలో ఓ మహిళ లైంగిక వేధింపులకు గురైంది. ఈ విషయాన్ని చెన్నై విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానంలో నిద్రపోతున్నపుడు తన వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి కావాలని తన శరీరాన్ని తాకాడని ఓ మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో వేధింపులకు పాల్పడిన రాజేష్‌శర్మ(43) అనే వ్యక్తిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி