TG: యాద్రాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోచౌటుప్పల్లో విషాదం చోటుచేసుకుంది. భారతి (27) అనే మహిళ భర్తతో గొడవ పడి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళంకు చెందిన భారతి దివిస్ లో వర్క్ చేస్తోంది. రోజు మాదిరే డ్యూటీకి వెళ్లి రాగా.. గురువారం మధ్యాహ్నం భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మనస్థాపం చెందిన భారతి చీరతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త వాసుదేవరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.