బెంగాల్ రాజకీయాలను కుదిపేసిన సందేశ్ ఖలీ ప్రాంతాన్ని ఎన్నికల తర్వాత సందర్శిస్తానని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. తమ పార్టీ ఎంపీ అభ్యర్థి హాజీ నూరుల్ను గెలిపించిన అనంతరం అక్కడికి వెళ్లి అక్కడి ప్రజలతో మమేకమవుతామన్నారు. ఇదిలా ఉండగా టీఎంసీ నేత మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారనే ప్రచారం కూడా దుమారం రేపింది. అయితే మమత సందేశ్ఖాలీకి వెళ్లలేదు.