వర్షాలు కురవాలని కప్పతల్లి ఆటాడిన మహిళలు

65பார்த்தது
హనుమకొండ జిల్లా ఆరేపల్లి గ్రామంలో వర్షాలు కురవాలని మంగళవారం మహిళలు కప్పతల్లి ఆడి పోచమ్మ తల్లికి బొడ్రాయికి జలాభిషేకం చేశారు. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నామని మహిళలు వాపోయారు. రైతులు పత్తి విత్తనాలు పెట్టి వర్షం కోసం ఎదురు చూస్తున్నారని పోచమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తే వర్షాలు పడతాయనే నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని మహిళలు తెలిపారు.

தொடர்புடைய செய்தி