హనుమకొండ జిల్లా పరిధిలోని ఆయా మండలాలలో ఎంపిక చేసిన గ్రామాలలో ప్రారంభమైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు, 2బీహెచ్ కే ఇళ్ల పురోగతి పై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం ఎంత వరకు వచ్చాయి, బేస్మెంట్ దశకు ఎన్ని వచ్చాయో వివరించారు.