హనుమకొండ: పర్యావరణహితానికి క్లాత్ బ్యాగులను వినియోగించాలి

66பார்த்தது
పర్యావరణ హితానికి క్లాత్ బ్యాగులనే వినియోగించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో మెప్మా ఆధ్వర్యంలో తయారుచేసిన పర్యావరణహిత క్లాత్ బ్యాగులను కలెక్టర్ ఆవిష్కరించారు. ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి ముప్పు కలుగుతుందని, కాబట్టి పర్యావరణహితానికి క్లాత్ బ్యాగులనే వినియోగించాలని కోరారు. కలెక్టరేట్లో ప్లాస్టిక్ బాటిళ్ల నియంత్రణకు చర్యలు చేపట్టామన్నారు.

தொடர்புடைய செய்தி