మతిస్థిమితం లేక. ఆర్థిక పరిస్థితి బాగా లేని బాధితులకు వరంగల్ దేశాయిపేట కార్పొరేటర్ సురేశ్ జోషి ఆపన్నహస్తం అందించారు. పోచమ్మమైదాన్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు రంజిత్ కుమార్, అతడి సోదరి రమాదేవి ప్రైవేట్ టీచర్. ప్రస్తుతం మతిస్థిమితం లేకుండా ఉన్నారు. హాస్టల్ గోడ పక్కన ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ తలదాచుకుంటున్నారు. కార్పొరేటర్ చలించిపోయి, తన సొంత ఖర్చులతో గుడిసె వేయించి నీడ కల్పించారు.