పాఠశాల విద్యార్థులకు కౌమార దశ నుండే విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య అనుసంధానం పెరిగి కుటుంబ వ్యవస్థ బలోపేతం చేయడం జరుగుతుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావణ్య అన్నారు. సంస్కార వికాస శిక్షణ, పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ దినోత్సవ సందర్భంగా గురువారం ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.