అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది

61பார்த்தது
ఆపదలో ఉన్న మనిషిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా అన్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలంలో రక్తదాన దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదన్నారు. అనంతరం రక్తదానం చేసిన దాతలకు సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు.

தொடர்புடைய செய்தி