రైతులను నష్ట పరిస్తే చర్యలు తప్పవు

1052பார்த்தது
రైతులను నష్ట పరిస్తే చర్యలు తప్పవు
జనగామ జిల్లా జాఫర్గడ్ మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో గురువారం స్టేషన్ ఘనపూర్ కు చెందిన పత్తి వ్యాపారి రైతుల వద్ద నుండి తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేస్తుండగా మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు ఆదేశానుసారం పత్తి లోడును మార్కెట్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. రైతులు ఎవరూ కూడా చిల్లర కాంటాలకు పత్తి అమ్మి నష్టపోకూడదని మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు ఒక ప్రకటనలో కోరారు. అంతేకాకుండా చిల్లర కాంటాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ పెంతల రాజ్ కుమార్, మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி