హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమలాపూర్ మండల కేంద్రం సమీపంలోని ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఓ కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నారు. ఘటనలో పలువురికి తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.