చేప పిల్లలను చెరువులో వదిలిన ఎమ్మెల్యే

81பார்த்தது
మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. శనివారం ఏల్గూర్ రంగంపేట చెరువులో ముదిరాజ్ కులస్తులతో కలిసి ఎమ్మెల్యే చేప పిల్లలను చెరువులో వదిలారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక పండుగలా జరుపుతున్నదన్నారు. ముదిరాజ్ కులస్తులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.

தொடர்புடைய செய்தி