జ్యోతిరావు ఫూలే నేషనల్ ఫెలోషిప్ అవార్డు - 2022 కు తొర్రూరు మండలంలోని పోలేపల్లి గ్రామానికి చెందిన పయ్యావుల ప్రవీణ్ యాదవ్ ఎంపిక అయినట్లు భారతీయ దళిత సాహిత్య అకాడమీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జితేందర్ మను మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. భారత మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ స్థాపించిన భారతీయ దళిత సాహిత్య అకాడమీ వారు మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్వర్యంలో ప్రవీణ్ సమాజానికి చేస్తున్న ఎనలేని సేవలను గుర్తించి డిసెంబరు 11, 12వ తేదీన ఢిల్లీలోని పంచశీల ఆశ్రమంలో జరిగే జాతీయ దళిత రచయితల సదస్సులో అవార్డ్ తో సత్కరించనున్నట్లు తెలిపారు.