ఇసుక రవాణా పర్మిషన్ ను రద్దు చేయాలి

53பார்த்தது
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం వాగు పరివాహక ప్రాంతాల్లో కొనసాగుతున్న ఇసుక రవాణా పర్మిషన్ ను రద్దుచేయాలని జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ కి వినతిపత్రాన్ని అందించారు. సోమవారం రాంబోజీగూడెం, గొల్లపల్లి గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి వాగులోంచి ఇసుకను తీస్తే భూగర్భజలాలు ఎండిపోయి రైతులు నష్టపోతారని, తక్షణమే ఇసుక రవాణా పర్మిషన్ ను రద్దుచేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி